ఏపీలో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ నుంచి పార్టీ నాయకులు మెల్లగా కాదు.. జోరుగానే జారుకుంటున్నారు. వరుస పెట్టి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. వీరిలో ఏమీ పిల్ల నాయకులు.. చిల్లర నాయకులు లేరు. అందరూ పెద్ద తలకాయల దగ్గర పిల్ల తలకాయలుగా పనిచేసిన వారే కావడం. పట్టు మని పది రోజులు కూడా.. ఉండలేక పోతున్నారా? అంటే.. ఔననే చెప్పాలి. ఎన్నికల ఫలితం వచ్చి.. 15 రోజులు మాత్రమే అయింది. కానీ, ఈ ఇంతలోనే కీలక నేతల అనుచరులు జారుకుంటున్నారు.