ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.1.20లక్షల ఫైన్‌

64చూసినవారు
ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.1.20లక్షల ఫైన్‌
ఐఐటీ బాంబే విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని అపహాస్యం చేసేలా ప్రదర్శించిన నాటకం పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణా కమిటీని ఏర్పాటుచేసి ఘటనపై దర్యాప్తు జరిపింది. అనంతరం నాటిక ప్రదర్శించిన విద్యార్థులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థి రూ.1.20లక్షలు చెల్లించాలని యాజమాన్యం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్