తిరుమలలో పెరిగిన రద్దీ

1612చూసినవారు
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ ఉంది. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 66,077 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. స్వామివారికి 29,193 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్