ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ సాధించాడు. 125 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో శుభ్మన్ గిల్ 100 పరుగులు చేశాడు. రోహిత్ 41, విరాట్ కోహ్లీ 22, శ్రేయాస్ 15, అక్షర్ 8 పరుగులకే ఔట్ కావడంతో గిల్ నిలకడగా ఆడుతూ భారత జట్టును విజయం వైపు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 46 ఓవర్లకు 223/4 గా ఉంది.