తెలంగాణలో నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ(LRS)కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే LRS ఫీజులోనూ ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇచ్చింది. ఇందుకు మూడు నెలల్లో తేల్చి క్రమబద్ధీకరించాలనే ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగేశారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను రెడీ చేశారు.