టీ20 ప్రపంచ కప్లో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీస్ జరగనుంది. గయానా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాసేపు అభిమానులను టెన్షన్కు గురిచేసిన వరుణుడు కాస్త శాంతించాడు. వర్షం ఆగినప్పటికీ.. పిచ్పై కవర్లను ఇంకా తీయలేదు. మైదానాన్ని సిద్ధం చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. టాస్ వేసేందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చు. ప్రస్తుతం వర్షం పడుతున్నట్లు సమాచారం.