భారత్ మూడోసారి ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. గతంలో శ్రీలంకతో కలిసి 2002లో సంయుక్తంగా విజేతగా నిలిచింది. ఆ సమయంలో గంగూలీ భారత కెప్టెన్గా వ్యవహరించారు. ఇక ధోని సారథ్యంలో రెండోసారి 2013లో ఇంగ్లాండ్ను ఫైనల్లో ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఇక తాజాగా రోహిత్ కెప్టెన్సీలో దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై గెలిచి మూడోసారి కప్ను సగర్వంగా అందుకుంది.