CTలో భారత్ విజయం సాధించడంపై విరాట్ కోహ్లీ స్పందించారు. కఠినమైన ఆస్ట్రేలియా టూర్ తర్వాత మళ్లీ భారీగా పుంజుకోవాలని, ఏదైనా పెద్ద టోర్నీ గెలవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా ఉందని అన్నారు. జూనియర్ ఆటగాళ్లలో అద్భుతమైన ప్రతిభ ఉందని, వారి పట్ల సంతోషంగా ఉందని అన్నారు. జూనియర్లతో మా అనుభవాన్ని పంచుకుంటున్నామని, అదే భారత్ను బలంగా చేస్తుందని కోహ్లీ తెలిపారు.