న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించడంతో ఏపీలో సంబరాలు అంబారాన్నంటాయి. విజయవాడ నగర వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. జాతీయ జెండాలతో అభిమానులు కేరింతలు, చప్పట్లు, డాన్సులు, టపాసులతో ఫ్యాన్స్ వేడుక చేసుకుంటున్నారు. విజయవాడ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డులో జాతీయ జెండాతో ప్రజలు ఊరేగింపు చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు భారీగా ర్యాలీ నిర్వహించి సంబరాలు చేపట్టారు.