భారతదేశ సంస్కృతిలానే ఇక్కడ ఆహారం కూడా సంప్రదాయనుగుణంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని భారతీయ వంటకాల గురించి ఖండాంతరాలకు వ్యాప్తి అవుతోంది. వీదేశీయులు సైతం మన వంటకాలను రుచి చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, తాజాగా నెదర్లాండ్లోని ఓ డచ్ కంపెనీ తన ఉద్యోగులకు భారతీయ వంటకాలను సర్వ్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.