భారతీయులు ఇరాన్‌కి వెళ్లొద్దు: కేంద్రం హెచ్చరిక

75చూసినవారు
భారతీయులు ఇరాన్‌కి వెళ్లొద్దు: కేంద్రం హెచ్చరిక
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్ నుంచి ఎవరూ అనవసరంగా ఇరాన్‌కు వెళ్లవద్దని సూచించింది. యుద్ధం జరుగుతున్న దేశాల్లోని పరిస్థితులను, అక్కడి భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, భారత పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణాలు చేయకండని పేర్కొంది.

సంబంధిత పోస్ట్