రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.78.94 లక్షలు లూటీ

78చూసినవారు
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.78.94 లక్షలు లూటీ
పార్ట్ టైమ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి ముగ్గురు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో చోటు చేసుకుంది. అమీన్‌పూర్‌కు చెందిన ముగ్గుల వ్యక్తుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.78.94 లక్షలు కాజేశారు. పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఒక వ్యక్తి నుంచి రూ.59 లక్షలు, టాస్క్‌ల పేరుతో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుంచి రూ.19.94 లక్షలు వసూలు చేశారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్