తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని స్నేహితుడిని ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేశాడు. ఈ నెల 23వ తేదీన మూసాపేట వద్ద రైలు పట్టాలపై డానీష్(17) అనే ఇంటర్ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. 22వ తేదీ రాత్రి డానీష్కు స్థానిక రౌడీషీటర్ కుమారుడు(17) ఫోన్ చేసినట్లు గుర్తించారు. 8మంది స్నేహితులతో కలిసి డానీష్పై బీరు సీసాలతో దాడి చేసి చంపారు. అనంతరం డెడ్బాడీని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు.