మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఇవాళ తెల్లవారుజామున మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్థీవ దేహాన్ని ఆయన స్వస్థలం నిజామాబాద్కు తరలిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ నివాసంలో డీఎస్ భౌతికాయానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం డీఎస్ మృతి దేహాన్ని స్వగ్రామంలో ఉంచి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.