రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

54చూసినవారు
రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌పై ఘన విజయం అందుకున్న అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారని పేర్కొన్నాడు. ఎనిమిది మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం కూడా కలిసొచ్చిందని అభిప్రాయపడ్డాడు. ‘టీ20ల్లో ఎక్కువగా ఫిఫ్టీలు, సెంచరీలు అవసరం లేదనుకుంటా. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకొస్తే ఆటోమేటిక్‌గా పరుగులు వస్తాయి. జట్టులో ఎక్కువ అనుభవం కలిగిన ప్లేయర్లు ఉన్నారు’ అని వ్యాఖ్యానించాడు.

సంబంధిత పోస్ట్