సభకు జగన్ వస్తే గౌరవిస్తా: స్పీకర్

60చూసినవారు
సభకు జగన్ వస్తే గౌరవిస్తా: స్పీకర్
అసెంబ్లీలో పలు మీడియా సంస్థలకు నిషేధం ఎత్తివేస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ‘జగన్‌కు ప్రతిపక్ష హోదా లేకపోయినా.. సభలోకి వస్తే గౌరవిస్తా. స్పీకర్ ఎన్నిక సమయంలో సభలోకి రావాలనే స్పృహ లేకపోతే ఎలా? సభా సంప్రదాయాలను ఎవరైనా గౌరవించాల్సిందే. గత ప్రభుత్వ దౌర్జన్యాలపై నేను దూకుడుగా మాట్లాడా. ఇప్పుడు బాధ్యతాయుత పదవిలో ఉన్నా. ఇప్పుడలా మాట్లాడాల్సిన అవసరం లేదు.’ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్