మహిళలకు ఉచిత బస్సు.. కీలక అప్‌డేట్

72చూసినవారు
మహిళలకు ఉచిత బస్సు.. కీలక అప్‌డేట్
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామన్నారు. సచివాలయంలో ఇవాళ ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ‘తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యంలో ఎదురయ్యే లోటు పాట్లు ఏపీలో తలెత్తకుండా చూస్తున్నామని అన్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా దర్శిలో రూ.18.51 కోట్ల అంచనాలతో డ్రైవింగ్ శిక్షణ, రీసెర్చ్ సంస్థ ఏర్పాటు ఫైల్‌పై తొలి సంతకం చేశారు.

సంబంధిత పోస్ట్