కొనుగోళ్ల జోరుతో వరుసగా 5వ రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల పైకి చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పై. పెరిగి 83.28 వద్ద ముగిసింది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత 5 ట్రేడింగ్ రోజుల్లో రూ.11.29 లక్షల కోట్లు పెరిగి, తాజా గరిష్ఠ రికార్డు రూ.404.18 లక్షల కోట్లకు చేరింది.