దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమాకు 'మహారాజా' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సినీ పరిశ్రమలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.