కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవడంతో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వివిధ సంఘాల పిలుపు మేరకు సంయుర్త కిసాన్ మోర్చా శుక్రవారం భారత్ బంద్ చేపట్టింది. దీంతో పంజాబ్, హర్యానాలో దుకాణాలు, పలు సంస్థలు మూతపడ్డాయి. ఈ క్రమంలో హర్యానాలోని శంభు సరిహద్దులో ఆందోళన చేస్తున్న జియాన్ సింగ్ (63) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే అతడిని పంజాబ్లోని సివిల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.