ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు శంకుస్థాపన చేశారు. పట్టణ రవాణా, ఆరోగ్యం, రైలు, పర్యాటక రంగాల్లో రూ.9,770 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్ష యోజన (PMSSY) కింద స్థాపించబడిన AIIMS-రేవారీ హర్యానా ప్రజలకు సమగ్రమైన, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తుందన్నారు.