సన్నబియ్యానికే బోనస్‌ ఇస్తామనడం దారుణం: ఏలేటి

76చూసినవారు
సన్నబియ్యానికే బోనస్‌ ఇస్తామనడం దారుణం: ఏలేటి
సన్నబియ్యానికే రూ.500 బోనస్‌ ఇస్తామనడం దారుణం అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిఅన్నారు. రాష్ట్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎక్కువగా పండేది దొడ్డుబియ్యమేనని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నేతలు చావుకబురు చల్లగా చెబుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రమే సన్నబియ్యం పండిస్తారని.. 30 జిల్లాల్లోని రైతులు దొడ్డు బియ్యం పండిస్తున్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్