లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్బీర్సింగ్ బ్రార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో బ్రార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నేతలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.