న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీమిండియాకు అభినందనలు తెలిపారు. భారత జట్టుకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా అని ముర్ము ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.