జ్యుయెలరీ దుకాణంలో ఐటీ సోదాలు.. రూ.26 కోట్ల నగదు సీజ్

70చూసినవారు
జ్యుయెలరీ దుకాణంలో ఐటీ సోదాలు.. రూ.26 కోట్ల నగదు సీజ్
మహారాష్ట్రలోని నాసిక్‌ పట్టణంలోగల సురనా జ్యుయెలరీ దుకాణంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో ఐటీ అధికారులు రైడ్‌ చేశారు. ఈ సోదాల్లో రూ.26 కోట్ల ఆధారాలు లేని నగదు లభ్యంకావడంతో సీజ్‌ చేశారు. అదేవిధంగా రూ.90 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్