మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల సురనా జ్యుయెలరీ దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో ఐటీ అధికారులు రైడ్ చేశారు. ఈ సోదాల్లో రూ.26 కోట్ల ఆధారాలు లేని నగదు లభ్యంకావడంతో సీజ్ చేశారు. అదేవిధంగా రూ.90 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.