ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి ఓ మూడంతస్తుల ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.