గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్ -3 ప్రయోగం గురించి ఆయన మరోసారి స్పందించారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతమైంది. దాన్నుంచి డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నాం. ఇక, జాబిల్లిపై భారతీయుడు అడుగుపెట్టేంతవరకు చంద్రయాన్ సిరీస్లను కొనసాగించాలని అనుకుంటున్నాం’’ అని వెల్లడించారు.