రూటు మార్చేస్తున్న జగన్!

14072చూసినవారు
రూటు మార్చేస్తున్న జగన్!
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు విపక్ష వైసీపీ అధినేత జగన్ ను అనివార్యంగా కూటమి వైపు నెట్టేస్తున్నాయి. ఐదేళ్లుగా మోడీతో జట్టు కట్టినా ఏపీలో మాత్రం పరిస్ధితులు తారుమారు కాగానే బీజేపీ తనకు దూరంగా జరిగిపోవడంతో వచ్చే ఐదేళ్లలో ఏం జరగబోతోందో జగన్ ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. దీంతో తన వ్యూహాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ ధర్నాలో అనూహ్యంగా లభించిన ఇండీ కూటమి మద్దతు ఇప్పుడు జగన్ ఆలోచనల్ని మార్చేసేలా కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్