AP: ఏపీ రామజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాన్యులు, ముఖ్యంగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారికి జనసేన అధిష్టానం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్తిపాడు సీహెచ్సీ డా. శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి పరుపుల తమ్మయ్య బాబును అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ చర్యలతో భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి చేయకుండా ఉంటారని పార్టీ అధినేత పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.