కోటాలో జేఈఈ విద్యార్ధి ఆత్మ‌హ‌త్య‌

73చూసినవారు
కోటాలో జేఈఈ విద్యార్ధి ఆత్మ‌హ‌త్య‌
రాజస్థాన్‌లోని కోటాలో మ‌రో విద్యార్ధి ప్రాణాలు విడిచాడు. బిహార్‌కు చెందిన జేఈఈ విద్యార్థి సందీప్ కుమార్ త‌న గ‌దిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. హాస్ట‌ల్‌లో నివ‌సిస్తున్న ఇత‌ర విద్యార్థులు కిటికీలోంచి మృత‌దేహాన్ని చూసి వెంట‌నే యాజ‌మాన్యానికి సమాచారం అందించారు. సందీప్ కుమార్ గత రెండేళ్లుగా కోటాలో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ 12 మంది విద్యార్థులు ప్రాణాలు విడిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్