ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి 4 పేజీల లేఖ రాశారు. తప్పుడు ప్రచారంతో రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను దిగజార్చారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే 4 సార
్లు విచారణకు హాజరయ్యానని.. అన్ని విధాలుగా సహకరించారని తెలిపారు. బీజేపీలో చేరితే కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. పార్లమెంటులో విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామని
బీజేపీ నేతలన్నారని తెలిపారు.