దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ మొత్తం 44 రోజుల పాటు సాగనుంది. ఈ నెల 9 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ మరుసటి రోజు (ఈ నెల 10) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది.