ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులను సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇన్సులిన్ అందించేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 22న తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. దీనిపై రేపటిలోగా స్పందించాలని జైలు అధికారులు, ఈడీని ఆదేశించింది.