తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటనపై నేటి నుంచి జ్యుడీషియల్ ఎంక్వైరీ ప్రారంభంకానుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపనుంది. ఆరునెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్కు ప్రభుత్వం సూచించింది. టీటీడీ చరిత్రలో టోకెన్ల జారీ క్యూలైన్లో ఆరుగురు మరణించడం అదే తొలిసారి.