బాన్సువాడ: అమ్మవారిని దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు

79చూసినవారు
బాన్సువాడ: అమ్మవారిని దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ రామ కాలనీ లోని రామాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ మహా చండీదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, బాన్సువాడ పట్టణ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్