రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిసారి నియోజకవర్గానికి వస్తున్న కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుకు ఘన స్వాగతం పలికేందుకు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం కొయ్యగొట్టలోని అమరవీరుల స్థూపం నుండి భారీ బైక్ ర్యాలీ చేపట్టి అనంతరం ఆత్మీయ సన్మాన సభ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.