కుర్తి పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

72చూసినవారు
కుర్తి పాఠశాలను సందర్శించిన ఎంఈఓ
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను శనివారం పిట్లం మండల ఎంఈఓ దేవి సింగ్ సందర్శించారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజు ఆన్లైన్లో పొందుపరచాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. విద్యార్థుల ప్రగతిని క్లాసులోకి వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్