కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుండారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి అనే గర్భిణీకి ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు 40వ వార్డ్ కౌన్సిలర్ విజయభాస్కర్ గౌడ్ ని సంప్రదించారు. వారు వెంటనే స్పందించి జిల్లా రక్తదాతల సేవాసమితి వారికి తెలిజేయడంతో అడ్లూరు చెందిన బాలూరి శశికుమార్ సహకారంతో వారికి కావలసిన రక్తం గురువారం సకాలంలో అందజేయడం జరిగింది.