ముత్యంపేటలో కొనుగోలు కేంద్రం ప్రారంభం

57చూసినవారు
ముత్యంపేటలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారి కృష్ణారెడ్డి, విండో కార్యదర్శి రామచంద్రం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్