కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశాలకు ఈనెల 25 లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ భానుమతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 నుంచి ఇంటర్ లో విద్యార్థులకు ఎంఈసి, సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపుకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫస్ట్ ఇయర్ లో దరఖాస్తులను స్వీకరించడానికి ఈనెల 25 చివరి తేదీగా తెలిపారు.