కోర్టు ఆదేశాల మేరకే అవిశ్వాస సమావేశం

71చూసినవారు
కోర్టు ఆదేశాల మేరకే అవిశ్వాస సమావేశం
హైకోర్టు ఆదేశాల మేరకే అవిశ్వాస సమావేశం నిర్వహించినట్లు జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ తెలిపారు. గురువారం భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ సొసైటీ అధ్యక్షులు లింగాల కిష్టగౌడ్ పై పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సొసైటీలో అవిశ్వాస సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలను రికార్డు చేసి హైకోర్టుకు సమర్పించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్