రెండవ రోజు కొనసాగుతున్న ఎల్లమ్మ ఉత్సవాలు
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఎల్లమ్మ దేవి దశమ వార్షికోత్సవ, సిద్ధియాగము, దేవి కళ్యాణ ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. ఉదయం దేవీపూజ చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహంను గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు వాయిదాలతో నృత్యాలు చేస్తూ ఊరేగించారు. సాయంత్రం 4 గంటలకు గ్రామదేవతలకు, పోచమ్మలకు బోనాల కార్యక్రమం ఉంటుందని గౌడ పెద్దలు తెలిపారు.