శనివారం జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయం సాధించడంతో ఎల్లారెడ్డిలో క్రికెట్ అభిమానులు విజయోత్సవ సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని స్నేహ మల్టిస్పెషలిటి పిల్లల ఆసుపత్రి ఎదుట, గాంధీచౌక్ లో యువకులు, క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచాను కాల్చారు. ఉత్కంఠ భరిత పోరులో సౌత్ ఆఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించడంతో సంబురాలు జరుపుకున్నారు.