అర్హులైన వారికి నూతన ఓటు హక్కు నమోదు చేయించండి

82చూసినవారు
అర్హులైన వారికి నూతన ఓటు హక్కు నమోదు చేయించండి
స్థానిక సంస్థల ఎన్నికలకోసం 18 ఏళ్ళు నిండిన యువతి యువకులకు నూతన ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆర్డీఓ ఆఫీసులో వివిధ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 31జీపీల వారీగా ఇంటింటా సర్వేచేసి ఓటర్ జాబితాను మార్పులు, చేర్పులతో సిద్ధం చేసి డ్రాఫ్టింగ్ చేశామన్నారు. ఇట్టి జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ జేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్