ఎల్లారెడ్డిలో ఘనంగా వరలక్ష్మి వ్రతం పూజలు

51చూసినవారు
ఎల్లారెడ్డితో పాటు గ్రామాల్లో, శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజలు సువాసినీ మహిళలు ఘనంగా జరుపుకున్నారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంను సువాసిని మహిళలు ఆనవాయితీగా జరుపు కుంటారు. ఇండ్లలో శ్రీ మహాలక్ష్మి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలతో, సుందరంగా అలంకరణ చేసి, శనగలు, అరటి పండ్లు, తమలపాకులతో నైవేద్యం సమర్పించి, శ్రీ మహాలక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

సంబంధిత పోస్ట్