కామారెడ్డి జిల్లాలో ఘనంగా వినాయకచవితి పండగ

74చూసినవారు
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ నియోజక వర్గాల్లో శనివారం వినాయకచవితి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లతో పాటు మండపాల్లో వినాయకుల పూజలు జరిగాయి. ఎక్కువ సంఖ్యలో మట్టి వినాయకుల ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇచ్చారు. ఎల్లారెడ్డిలో భారీ వర్షంతో వినాయక మండపాల వద్ద భక్తులు ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రంలో భారీ వినాయకుల ప్రతిష్ఠపాన చేశారు.

సంబంధిత పోస్ట్