లింగంపేట మండలం భవానిపేట్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కుస్తీ పోటీలు ప్రారంభిస్తామని ఎంపీటీసీ ఆకుల సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇతర ప్రాంతాల నుంచి మల్ల యోధులు కుస్తీ పోటీలకు రావాలని, మరియు మహిళా మళ్ల యోధులు ఈ పోటీలకు రానున్నారని వారికి పూర్తి భద్రత కల్పిస్తామని, చివరి కుస్తీ గెలుపొందిన వారికి నాలుగు తులాల వెండి కడియం బహుమానంగా ఇవ్వనున్నట్టు వారు పేర్కొన్నారు.