హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావించారు. ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభ జీరో అవర్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. 400 ఎకరాల HCU భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా భూముల అమ్మకానికి సిద్ధమైందని, విశ్వవిద్యాలయానికి కూటాయించిన భూములను కాపాడాలని కోరారు. ఇదే అంశంపై లోక్సభ జీరో అవర్లోనూ తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు.