స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్ఫ్ బిల్లుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లుపై చర్చలో పాల్గొనడకుండా తప్పించుకోవడానికి ప్రతిపక్షాలు వాకౌట్ను ఓ సాకుగా చెబుతున్నారని ఆరోపించారు. ఇక బుధవారం ఈ బిల్లుపై చర్చించడానికి కేంద్రం 8 గంటల సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు.