మల్యాల మండలము కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి, తలనీలాలు సమర్పించారు. ఈ రోజు ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.